ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeస్పోర్ట్స్మెస్సీ ఎమోషనల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. అభిమానులను ఆకట్టుకున్న సందేశం

మెస్సీ ఎమోషనల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. అభిమానులను ఆకట్టుకున్న సందేశం

మెస్సీ ఎమోషనల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. అభిమానులను ఆకట్టుకున్న సందేశం

బ్యూనస్‌ ఐరీస్: ఫిఫా ప్రపంచకప్ 2026లో జోర్డాన్‌పై అర్జెంటీనా 3-1తో విజయం సాధించిన అనంతరం స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విజయంతో పాటు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న మెస్సీ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో “మనం ఇంకా కలిసే ఉన్నాం” అంటూ సహచర ఆటగాళ్లు, అభిమానులకు మెస్సీ కృతజ్ఞతలు తెలిపారు. జట్టు ఐక్యత, అభిమానుల మద్దతే తమ బలమని పేర్కొన్న ఆయన సందేశానికి లక్షలాది లైకులు, కామెంట్లు వచ్చాయి.

జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోార్థంలో బరిలోకి దిగిన మెస్సీ అద్భుతమైన ఫ్రీకిక్ గోల్ నమోదు చేశారు. ఈ గోల్‌తో వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అర్జెంటీనా గ్రూప్ దశలో మూడు విజయాలతో నాకౌట్‌కు అర్హత సాధించింది.

మెస్సీ పోస్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ, ప్రపంచకప్ టైటిల్ కోసం అర్జెంటీనాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!