ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణనల్గొండలో సీఎం సభపై రాజకీయ చర్చ.. ఖాళీ కుర్చీలు కనిపించాయంటూ విమర్శలు

నల్గొండలో సీఎం సభపై రాజకీయ చర్చ.. ఖాళీ కుర్చీలు కనిపించాయంటూ విమర్శలు

నల్గొండలో సీఎం సభపై రాజకీయ చర్చ.. ఖాళీ కుర్చీలు కనిపించాయంటూ విమర్శలు

నల్గొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం రాజకీయ విమర్శలు ముమ్మరమయ్యాయి. సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరుకాలేదని, ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగుతున్న సమయంలో పలువురు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు కనిపించాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

సభలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళనను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తే సహించబోమని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ పనితీరుపై ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

మరోవైపు సభ నిర్వహణ, జనసమీకరణపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సభకు ప్రజల స్పందన ఆశించినంతగా లేదని, దీనిపై ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నాయి. అధికార పార్టీ మాత్రం సభ విజయవంతమైందని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగుతోందని చెబుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!