ఆర్మీ అగ్నివీర్ ఫలితాలలో ఎంపిక …విద్యార్థికి సన్మానం
- గజ్వేల్ జున్ 29, (ఆశ్వి అప్డేట్స్)
ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయంప్రతిపత్తి గజ్వేల్ కు చెందిన తృతీయ సంవత్సర విద్యార్థి కే అరవింద్ ఇటీవల వెల్లడైన అగ్నిపథ్ నేవీ ఎస్ ఎస్ ఆర్ ఫలితాలలో అగ్ని వీరుగా ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా అరవింద్ ను కళాశాల అధ్యాపక బృందం సన్మానించింది. కళాశాల ఎన్సిసి విభాగంలో ఉండడం వల్ల తాను అగ్నివీరుగా ఎంపిక కావడానికి మంచి అవకాశం లభించిందని అందుకు ఎన్సిసి ఎంతగానో సహకరించిందని దేశ సైన్యంలో చేరడం చేరే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అరవిందు తెలిపాడు ఈ సన్మాన కార్యక్రమం లో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేష్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం భవాని, ఎన్సిసి అధికారి డాక్టర్ మహేందర్ రెడ్డి మరియు ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు
