గురుకుల టెండర్లపై బహిరంగ చర్చకు గన్పార్క్కు బయల్దేరిన హరీశ్రావు
హైదరాబాద్: తెలంగాణ గురుకుల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గన్పార్క్కు బయల్దేరారు. గురుకుల టెండర్ల వ్యవహారంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన ప్రకటించారు.
హరీశ్రావు మాట్లాడుతూ, ఈ అంశంపై ప్రెస్క్లబ్లో చర్చకు రావాలని తాము కోరగా, మంత్రులు గన్పార్క్కు రావాలని సవాల్ విసిరారని తెలిపారు. “మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తున్నాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రశాంతంగా కూర్చొని ప్రజల ముందు చర్చిద్దాం” అని ఆయన పేర్కొన్నారు.
గురుకుల టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దీనిపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని హరీశ్రావు ఆరోపించారు. ఒకవేళ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు వస్తే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చర్చకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అయితే గన్పార్క్కు వెళ్తున్న హరీశ్రావును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం చర్చను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగిస్తోందని హరీశ్రావు ఆరోపించగా, ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
