వరి ధాన్యం కొనుగోలు చేయలేదంటూ సూసైడ్ చేసుకున్న రైతన్న
చిన్నశంకరంపేట,మే 20 ( అశ్వి అప్డేట్స్)
వరి ధాన్యం కొనుగోలు చేయక అప్పులు ఎక్కువై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిన్నశంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గవలపల్లి మధిర గ్రామం అగ్రహారం గ్రామానికి చెందిన గాయంతి రాజయ్య వయస్సు 45 అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గత 20 రోజుల నుండి వరి ధాన్యం ఆరబోయాగా ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం లేదని, అప్పులు ఎక్కువగా ఉండడంతో తీవ్ర మనస్థాపం చెంది తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
