ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeస్పోర్ట్స్భారత్-ఐర్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు

భారత్-ఐర్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు

భారత్-ఐర్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు.. వైభవ్ అరంగేట్రంపై ఉత్కంఠ

బెల్‌ఫాస్ట్: భారత్-ఐర్లాండ్ మధ్య నేడు జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఇది కీలక మ్యాచ్ కాగా, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే వర్ష సూచనలు మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితిని నెలకొల్పుతున్నాయి.

బెల్‌ఫాస్ట్‌లో రోజంతా మేఘావృత వాతావరణంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ ప్రారంభ సమయానికి సుమారు 35 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే లేదా ఓవర్లను కుదించే అవకాశం ఉందని సమాచారం.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఈ సిరీస్‌తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న ఐర్లాండ్ కూడా భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. వర్షం ప్రభావం లేకుండా మ్యాచ్ పూర్తిగా జరిగితే అభిమానులకు ఆసక్తికర పోరు చూడొచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!