ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeస్పోర్ట్స్సెమీస్ ఆశలు నిలవాలంటే గెలుపే మార్గం.. నేడు ఆస్ట్రేలియాతో భారత్ కీలక పోరు

సెమీస్ ఆశలు నిలవాలంటే గెలుపే మార్గం.. నేడు ఆస్ట్రేలియాతో భారత్ కీలక పోరు

సెమీస్ ఆశలు నిలవాలంటే గెలుపే మార్గం.. నేడు ఆస్ట్రేలియాతో భారత్ కీలక పోరు

లండన్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు నేడు అత్యంత కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ పోరు భారత్‌కు ‘డూ ఆర్ డై’గా మారింది. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం గ్రూప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్‌కు సెమీస్ చేరేందుకు ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగే పోరు ఫలితంపై కూడా సమీకరణాలు ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ భారత్ ముందుగా తన మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే.

భారత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు బలంగా మారింది. అయితే మిడిల్ ఆర్డర్ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడితే భారత్‌కు విజయావకాశాలు మెరుగుపడతాయి.

బౌలింగ్‌లో స్పిన్నర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుండగా, ఫీల్డింగ్‌లో పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవడం కీలకం. మరోవైపు ఇప్పటికే సెమీస్‌కు చేరువైన ఆస్ట్రేలియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరిత పోరును అందించనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!