ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల అర్ధరాత్రి చర్యలు కలకలం.. జర్నలిస్టు కేవీఆర్ అరెస్టుపై వివాదం

హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల అర్ధరాత్రి చర్యలు కలకలం.. జర్నలిస్టు కేవీఆర్ అరెస్టుపై వివాదం

హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల అర్ధరాత్రి చర్యలు కలకలం.. జర్నలిస్టు కేవీఆర్ అరెస్టుపై వివాదం

హైదరాబాద్: హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్టు కే. వెంకట్రామ్‌రెడ్డి (కేవీఆర్)ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకెళ్లిన ఘటన వివాదానికి దారితీసింది. ఏపీ పోలీసులు సివిల్ డ్రెస్సులో వచ్చి కేవీఆర్‌ను అరెస్టు చేశారని, ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

జర్నలిస్టు కేవీఆర్‌ను ఏపీకి చెందిన ఓ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్టు సమయంలో స్థానిక పోలీసుల సమక్షంలో జరిగిన వ్యవహారం, మహిళా పోలీసుల గైర్హాజరు, కుటుంబ సభ్యుల అభ్యంతరాలు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటనపై తెలంగాణకు చెందిన పలు జర్నలిస్టు సంఘాలు, సామాజిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అరెస్టు విధానంపై విచారణ జరపాలని కోరుతున్నాయి. మరోవైపు, కేవీఆర్ భార్య సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!